Reading Time: < 1 minute

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

Caption of Image.

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం (సెప్టెంబర్ 17) రాత్రి కారు నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. 

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

 

©️ VIL Media Pvt Ltd.