Reading Time: < 1 minute
The Highly Anticipated Mssubbulakshmi Biopic Is All Set To Begin In Chennai With Kamalhaasan Attending As The Special Guest

భారతరత్న, కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి 110వ జయంతి సందర్భంగా ఆమె పవిత్ర జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించేందుకు రంగం సిద్ధమైంది. గీతా ఆర్ట్స్, రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు బివి వర్క్స్ పతాకాలపై అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేష్ మరియు బన్నీ వాస్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంలో ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తుండగా, ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం ప్రారంభోత్సవ వేడుక సెప్టెంబర్ 16, 2026 బుధవారం సాయంత్రం 6:00 గంటలకు చెన్నైలోని ప్రతిష్టాత్మక ‘ది మ్యూజిక్ అకాడమీ’ ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు లోకనాయకుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అంతేకాకుండా, ఇండియన్ కోరల్ ఎన్‌సెంబుల్ బృందం ద్వారా ఎం.ఎస్. సుబ్బలక్ష్మి అమ్మగారి ఐకానిక్ గీతాల లైవ్ పెర్ఫార్మెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ ఈవెంట్‌కు ‘ఎంఎస్ బ్లూ’ రంగు దుస్తుల డ్రెస్ కోడ్‌ను నిర్ణయించారు.అత్యున్నత సాంకేతిక విలువల తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందిస్తున్నారు. సంగీత ప్రపంచంలో సరికొత్త శకానికి నాంది పలికిన ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి వారసత్వాన్ని, ఆమె జీవితంలోని అరుదైన ఘట్టాలను ఈ చిత్రం ద్వారా నేటి తరానికి అందించబోతున్నారు. సెప్టెంబర్ 16న జరిగే ఈ గ్రాండ్ లాంచ్‌తో సినిమాకి సంబంధించిన మరిన్ని విశేషాలు వెల్లడి కానున్నాయి.