
బీజేపీ మరియు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేడు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో “తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు” ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు..
ముఖ్య అతిథులు: భారత ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, జి. కిషన్ రెడ్డి, మరియు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తదితర ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు…
సాయుధ బలగాల పరేడ్: సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక మార్చ్పాస్ట్ మరియు పరేడ్ ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది…
సాంస్కృతిక ప్రదర్శనలు: తెలంగాణకు చెందిన 800 మందికి పైగా కళాకారులు బోనాలు, దప్పులు, గుస్సాడి వంటి సాంప్రదాయ నృత్యాలతో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రదర్శనలు ఇచ్చారు…