
హైదరాబాద్ సిటీ, వెలుగు: సీఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన 53 గణేశ్నిమజ్జన కేంద్రాల్లో ఇప్పటివరకు 6,629 విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యిందని కమిషనర్ సృజన తెలిపారు. బుధవారం కూకట్పల్లిలోని ఐడీఎల్ చెరువు, కొంపల్లిలోని సురారం చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్తో కలిసి పరిశీలించారు.
ఆమె మాట్లాడుతూ ఇప్పటివరకు నిమజ్జనమైన విగ్రహాల్లో 3 అడుగుల లోపు 6,361 ఉండగా, 3 అడుగులకు మించినవి 268 ఉన్నాయని చెప్పారు. నిమజ్జనాలను కంట్రోల్ రూమ్ ద్వారా 24గంటలు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.