
Rashmika Mandanna: పాన్ – ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన కెరీర్కు సంబంధించి పెద్ద డెసిషన్ తీసుకోబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం మొదలైంది. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాల్లో అందాల ఆరబోత, రొమాంటిక్ పాటలకే పరిమితం అయినట్లు కాకుండా.. ఇకపై పూర్తిగా కంటెంట్ ఓరియెంటెడ్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రష్మిక కెరీర్లోనే మైలురాయిగా నిలిచేలా భారతీయ సంగీత దిగ్గజం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బయోపిక్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఆమె ఇకపై గ్లామర్ పాత్రలకు పూర్తిగా స్వస్తి పలకనుందనే వార్తలు చిత్రసీమలో హాట్ టాపిక్గా మారాయి. ఇటీవలి కాలంలో వచ్చిన వరుస భారీ చిత్రాలతో రష్మిక కెరీర్, స్టార్డమ్ పీక్స్కి చేరినప్పటికీ, నటిగా తనలోని పూర్తి ప్రతిభను బయటకు తీసే ప్రాజెక్టులపై ఇకపై ఆమె దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ రొమాంటిక్, కాక్టైల్ తరహా గ్లామర్ పాత్రలు, కేవలం హీరోయిన్ ఎలివేషన్ కోసం మాత్రమే ఉండే క్యారెక్టర్లను ఇకపై తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తన ఫ్యూచర్ ప్లాన్లో భాగంగా బలమైన కథ, ప్రాధాన్యత ఉన్న పాత్రలనే తన ‘మెయిన్ ఆప్షన్’గా ఎంచుకుంటూ రూట్ మార్చుకోవాలని చూస్తున్నారట.
ఈ మార్పులో భాగంగానే రష్మిక ఖాతాలో ఓ అరుదైన అవకాశం చేరింది. భారతదేశం గర్వించదగ్గ సంగీత దిగ్గజం, భారతరత్న ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక బయోపిక్లో నటించేందుకు రష్మిక పచ్చజెండా ఊపింది. ఇలాంటి లెజెండరీ పర్సనాలిటీ పాత్రను పోషించే అవకాశం రావడం ఒక నటిగా తనకు దక్కిన అత్యంత అదృష్టంగా ఆమె భావిస్తున్నారు. ఆ పాత్ర ఔన్నత్యం, గౌరవాన్ని కాపాడే క్రమంలో తన ఇమేజ్ను సంపూర్ణంగా నటనకు మాత్రమే అంకితం చేయాలని ఆమె భావిస్తున్నట్లు టాక్. గ్లామరస్ హీరోయిన్గా కోట్ల మంది హృదయాలను కొల్లగొట్టిన ‘నేషనల్ క్రష్’.. ఇప్పుడు నటనకు పెద్దపీట వేస్తూ బయోపిక్స్, పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాల బాట పట్టడం సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఒక లెజెండ్ పాత్రతో తన నటనలోని సరికొత్త కోణాన్ని చూపించేందుకు రష్మిక సిద్ధమవుతుండటంతో ఆమె అభిమానులు ఈ ప్రాజెక్ట్పై భారీ ఆశలు పెట్టుకున్నారు.