Reading Time: 2 minutes

ఆఫ్ఘన్‌పై రచ్చ.. టీ20ల్లో 9000 రన్స్ బాదిన సంజు: కోహ్లీ, రోహిత్ క్లబ్‌లోకి శాంసన్ 

Caption of Image.

Sanju Samson: ఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మూడో టీ20లో భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో కళ్లు చెదిరే ఫామ్‌తో దూసుకెళ్తున్న సంజు, టీ20 క్రికెట్‌లో ఏకంగా 9,000 పరుగుల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ చారిత్రాత్మక ఫీట్‌తో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి లెజెండ్ల సరసన చేరి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

5వ ఓవర్లోనే రికార్డు బద్దలు: 

ఈ మ్యాచ్‌కు ముందు 9,000 పరుగుల ల్యాండ్‌మార్క్ చేరుకోవడానికి సంజుకు కేవలం 23 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. అభిషేక్ శర్మతో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజు శాంసన్, టీమిండియా ఇన్నింగ్స్ 5వ ఓవర్లోనే 23 పరుగుల మార్కును దాటి 9,000 రన్స్ మార్కును అందుకున్నాడు. తన T20 కెరీర్‌లో 351వ మ్యాచ్ (334వ ఇన్నింగ్స్) ఆడుతున్న సంజు ఖాతాలో ఇప్పటి వరకు ఏకంగా 8 సెంచరీలు, 57 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం.

రోహిత్, కోహ్లీ సరసన సంజు: 

టీ20 క్రికెట్ చరిత్రలో 9,000 పరుగులు పూర్తి చేసుకున్న ఐదో భారత ఆటగాడిగా సంజు శాంసన్ నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీట్ సాధించిన 35వ క్రికెటర్‌గా నిలిచాడు.

టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు:

* విరాట్ కోహ్లీ: 14,218 పరుగులు

* రోహిత్ శర్మ: 12,531 పరుగులు

* శిఖర్ ధావన్: 9,797 పరుగులు

* సూర్యకుమార్ యాదవ్: 9,729 పరుగులు

* సంజు శాంసన్: 9,027* పరుగులు

2026లో డ్రీమ్ ఫామ్.. వరల్డ్ కప్ హీరో: 

2026 సంవత్సరం సంజు శాంసన్ కెరీర్‌కే గోల్డెన్ ఇయర్‌గా నిలిచింది. ఈ ఒక్క ఏడాదే అంతర్జాతీయ టీ20ల్లో 500 పైగా పరుగులు సాధించాడు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 విజయంలో భారత్ తరఫున సెమీఫైనల్, ఫైనల్ సహా నరాలు తెగే నాకౌట్ మ్యాచ్‌ల్లో విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు డొమెస్టిక్‌లో కేరళకు ఆడుతున్న సంజు శాంసన్, ఇప్పుడు టీమిండియా ప్రధాన వికెట్ కీపర్ బ్యాటర్‌గా తన స్థానానికి ఎవరూ చేరుకోలేనంత ఎత్తులో నిలబెట్టుకున్నాడు.

►ALSO READ | 30 బంతుల్లోనే 100.. గ్రౌండ్‌లో పూనకాలు: అభిషేక్ శర్మ దెబ్బకు రికార్డులు అల్లాడిపోయాయ్!

©️ VIL Media Pvt Ltd.