
న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్లో ఇప్పటికే వందల వేల డాలర్లు కొల్లగొడుతూ ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్న ఈ సినిమా చుట్టూ ఇప్పుడు ఒక హాట్ టాపిక్ నడుస్తోంది. సినిమాకున్న విపరీతమైన హైప్ను క్యాష్ చేసుకునేందుకు.. ఇండియాలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్లను భారీగా పెంచబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ వార్తలతో ఒక్కసారిగా ఫ్యాన్స్, సగటు సినీ ప్రేక్షకుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఈ ప్రచారంపై ‘ది ప్యారడైజ్’ యూనిట్ ను సంప్రదించగా, వారు ఈ వార్తలపై కౌంటర్ ఇస్తూ అసలు నిజాన్ని బయటపెట్టారు. ‘ది ప్యారడైజ్’ టికెట్ ధరల (Hikes) పెంపు గురించి నెట్టింట జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, అవన్నీ వట్టి పుకార్లేనని మేకర్స్ తేల్చి చెప్పారు. ప్రస్తుతానికి టికెట్ రేట్ల పెంపుపై తమలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అసలు ఆ ఆలోచనే ఇప్పటివరకు రాలేదని టీమ్ క్లారిటీ ఇచ్చింది.
సినిమా విడుదలకు సంబంధించిన ఫైనాన్షియల్ వ్యవహారాలు, ప్రైసింగ్ దశకు ఇంకా వెళ్లలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం యూనిట్ మొత్తం కేవలం ‘కంటెంట్ డెలివరీ’ పైనే పూర్తి ఫోకస్ పెట్టిందని తెలిపారు. ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో టీమ్ నిరంతరం శ్రమిస్తోందని వివరించారు. అధికారికంగా మేకర్స్ నుంచి ఈ క్లారిటీ రావడంతో ప్రేక్షకులకు పెద్ద రిలీఫ్ దొరికినట్లయింది. రిలీజ్ సమయానికి పరిస్థితులను బట్టి ధరల వ్యవహారంపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికైతే రేట్ల పెంపు అనేది కేవలం ఒక రూమర్ మాత్రమేనని తేలడంతో నాని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఓవర్సీస్ ప్రీమియర్స్కే రికార్డులు బద్దలు కొడుతున్న ‘ది ప్యారడైజ్’.. కంటెంట్ డెలివరీ కూడా అదే రేంజ్లో ఉంటే బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది!