
న్యూఢిల్లీ: స్పోర్ట్స్ షూ బ్రాండ్ అడిడాస్, గురుగ్రామ్ (హర్యానా)లోని తన టెక్ హబ్లో పనిచేస్తున్న 350 మందిని తొలగించింది. ఇక్కడ మొత్తం 700 మంది పనిచేస్తుండగా, ఇందులో 50 శాతం మందిని తీసేయడం గమనార్హం. సెప్టెంబర్ 15న నిర్వహించిన టౌన్హాల్ సమావేశంలో కంపెనీ మేనేజ్మెంట్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, డేటా ఇంజనీర్లతో పాటు పలు సాంకేతిక విభాగాలకు చెందిన నిపుణులు ఈ లేఆఫ్స్ బారిన పడ్డారు. వీరికి తగిన పరిహారం, సహాయం అందిస్తామని సంస్థ తెలిపింది. మారుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా సాంకేతిక కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అడిడాస్ పేర్కొంది. 2021లో ప్రారంభమైన ఈ గ్లోబల్ టెక్ హబ్ ఐదేళ్లకే భారీ కోతలు విధించడం, అటు ఒరాకిల్ కూడా రీస్ట్రక్చరింగ్ పేరుతో తాజా లేఆఫ్స్ ప్రారంభించడంతో ఐటీ ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తోంది.