
జనన, మరణాల నమోదు (సవరణ) చట్టం, 2026, అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ చట్టం ప్రకారం.. భారత రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి.. ఈ చట్టం అమల్లోకి వచ్చే తేదీని ప్రకటించారు. పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన అనంతరం ఈ చట్టానికి ఆగస్టులో రాష్ట్రపతి ఆమోదం లభించింది.
STORY | Registration of Births and Deaths (Amendment) Act to come into force on Oct 1
he provisions of a newly enacted law that tightens regulations for delayed registration of births and deaths will come into force on October 1, Registrar General of India Mrityunjay Kumar… pic.twitter.com/eIyPAcQJSb
— Press Trust of India (@PTI_News) September 17, 2026
సవరించిన నిబంధనల ప్రకారం, ఒక సంవత్సరం తర్వాత కానీ రెండు సంవత్సరాలలోపు కానీ నమోదైన జననం లేదా మరణాన్ని జిల్లా మేజిస్ట్రేట్, సబ్- డివిజనల్ మేజిస్ట్రేట్ లేదా జిల్లా మేజిస్ట్రేట్తో, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉత్తర్వుతో మాత్రమే నమోదు చేయాలి. రెండు సంవత్సరాల తర్వాత నమోదైన జనన, మరణాల నమోదుకు.. మొదటి తరగతి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఉత్తర్వు అవసరం. నమోదుకు అనుమతించే ముందు సమాచార ఖచ్చితత్వాన్ని ధృవీకరించాలి.
►ALSO READ | దిశా సాలియన్ కేసులో బిగ్ ట్విస్ట్.. ప్రధాని మోడీ, ట్రంప్ పేర్లను లాగిన ఉద్ధవ్ ఠాక్రే
దరఖాస్తుదారులు నిర్దేశించిన రుసుమును కూడా చెల్లించాలి. ఈ నిబంధనలను అమలు చేయడం వల్ల.. జనన, మరణాల నమోదు సకాలంలో అవడమే కాకుండా ఆలస్యమైన జనన, మరణాల దరఖాస్తులపై తనిఖీలను బలోపేతం చేయడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది.