
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న తొలి టీ20 పోరులో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. అరుణ్ జైట్లీ వికెట్పై ఛేజింగ్ అనుకూలిస్తుందనే అంచనాతో ఫీల్డింగ్ తీసుకున్నట్లు ప్రకటించిన అయ్యర్, ప్రెస్ వేదికగా ఒక షాకింగ్ న్యూస్ చెప్పి ఫ్యాన్స్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాడు. అద్భుతమైన ఫామ్లో ఉన్న 15 ఏళ్ల యంగ్ పవర్హౌస్ వైభవ్ సూర్యవంశీని తొలి టీ20కి తుది జట్టు నుంచి తప్పించినట్లు ప్రకటించాడు.
కారణం చెప్పని కెప్టెన్.. మేనేజ్మెంట్ రాజకీయం:
వైభవ్ సూర్యవంశీని డ్రాప్ చేయడానికి గల కచ్చితమైన కారణాన్ని వెల్లడించడానికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తోసిపుచ్చాడు. వైభవ్ను బెంచ్కే పరిమితం చేసి, అభిషేక్ శర్మకు జోడీగా సంజూ శాంసన్ను ఓపెనర్గా బరిలోకి దించుతున్నట్లు మాత్రమే తేల్చి చెప్పాడు. ప్రాక్టీస్లో ఇబ్బంది పడ్డాడనే కారణంతో ఈ కుర్రాడిని పక్కనపెట్టడం వెనుక డ్రెసింగ్ రూమ్ రాజకీయం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జస్ప్రీత్ బుమ్రా రీ ఏంట్రీ జట్టుకు కలిసొచ్చే అంశం అని శ్రేయస్ కొనియాడాడు.
7 నెలల తర్వాత మైదానంలోకి ఆఫ్ఘన్:
2026 టీ20 వరల్డ్ కప్లో ఫిబ్రవరి 19వ తేదీన కెనడాతో మ్యాచ్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆడుతున్న తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఇదే కావడం విశేషం. దాదాపు ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత పొట్టి ఫార్మాట్ ఆడుతున్న ఆఫ్ఘన్ను తక్కువ అంచనా వేయకుండా బోణీ కొట్టాలని భారత్ భావిస్తోంది. సెప్టెంబర్ 15, 17 తేదీల్లో జరగబోయే తదుపరి రెండు మ్యాచ్లకు కూడా ఢిల్లీనే వేదిక కానుంది.