Reading Time: < 1 minute
Ravi Shastri Praises Pm Modi At Brics Summit Says International Diplomacy Like Never Before

Ravi Shastri: న్యూఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో సహా మొత్తం 11 సభ్యదేశాల అధినేతలో పాటు మరో 10 భాగస్వామ్య దేశాల అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యారు.

అయితే, ఈ సమావేశాల్లో ప్రధాని నరేంద్రమోడీ, జిన్‌పింగ్, పుతిన్ కలిసి ఉన్న ఫోటో ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది. దిగ్గజ నేతలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం సంచలనంగా మారింది. ఈ బ్రిక్స్ సదస్సుపై మాజీ క్రికెటర్, కామెంటేటర్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించారు. మోడీ, జిన్‌పింగ్, పుతిన్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి, మోదీ దౌత్య విజయాన్ని కొనియాడారు.

‘‘భారతీయుడిగా ఇంతకన్నా గర్వంగా ఎప్పుడూ అనిపించలేదు. అధ్యక్షుడు పుతిన్, అధ్యక్షుడు షీ, మన అద్భుతమైన ప్రధాని నరేంద్ర మోదీ.. మాతృభూమి భారత్‌లో కలిసి ఉన్నారు. ఇలాంటి అంతర్జాతీయ దౌత్యాన్ని ఇంతకుముందెన్నడూ చూడలేదు. మోదీజీకి సెల్యూట్’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

బ్రిక్స్ సమావేశాలు విజయవంతమయ్యాయి. రష్యా, చైనా అధ్యక్షులతో ప్రధాని నరేంద్రమోడీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఆదివారం దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాతో పాటు కజకిస్థాన్, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, బురుండి, ఉగాండా, నైజీరియా దేశాల నేతలతో మోడీ భేటీ అయ్యారు. బ్రిక్స్ దేశాల నేతలు శనివారం ఏకగ్రీవంగా “న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026”ను ఆమోదించారు.