Reading Time: < 1 minute
Toxic Event Accident Police Book Case Against Malla Reddy College Management

రాకింగ్ స్టార్ యశ్ నటించిన పాన్-ఇండియా చిత్రం ‘Toxic’ ప్రీ-రిలీజ్ వేడుకలో ఊహించని ప్రమాదం జరిగి పలువురు గాయపడిన ఘటనపై పోలీసులు తీవ్రంగా పరిగణించారు. మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో శనివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించారని మల్లారెడ్డి కాలేజ్ యాజమాన్యంతో పాటు ఈవెంట్ మేనేజర్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

Toxic’ ప్రీ-రిలీజ్ వేడుక కార్యక్రమం జరుగుతుండగా హీరో యశ్‌ను చూడటానికి అభిమానులు, విద్యార్థులు ఉత్సాహంతో వేదిక సమీపంలో అమర్చిన భారీ సౌండ్ బాక్స్ ప్రేమ్‌లు, ఫ్లడ్ లైట్ స్తంభాలపైకి ఎక్కారు. విద్యార్థుల బరువును తట్టుకోలేక అవి  ఒక్కసారిగా కుప్పకూలడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఈవెంట్‌లో తొక్కిసలాట లాంటి పరిస్థితులు నెలకొనగా, కొంతమంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు సకాలంలో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే స్టార్ హీరో వస్తున్నప్పుడు ఫ్యాన్స్ ఎక్కువగా వస్తారని తెలుసా తగినంత భద్రత కల్పించడంలో విఫమలమైంది. అలాగే అనుమతులకు మించి జనసమీకరణ, సరైన ప్రమాణాలు లేని నిర్మాణాలు ఏర్పాటు చేసినందుకే ఈ ప్రమాదం జరిగిందని భావించిన పోలీసులు మల్లారెడ్డి యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. అలాగే టాక్సిక్ చిత్ర యూనిట్‌పై కూడా కేసు నమోదు చేసారు పోలీసులు.