
ప్రతివారం కొత్త తరహా కథలు, ఉత్కంఠ రేకెత్తించే థ్రిల్లింగ్ సినిమాలతో ఓటీటీ ప్లాట్ఫామ్లు సినీ ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. డిజిటల్ వీక్షకులు సైతం వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఇంటి వద్దే హాయిగా చూసేందుకు సరికొత్త ఇంట్రెస్టింగ్ సినిమాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటీటీ ప్రియులను మెప్పించేందుకు మరో ఇంట్రెస్టింగ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చి అలరిస్తుంది. ఈ మిస్టరీ థ్రిల్లర్, తమిళంలోతో పాటుగా తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి వచ్చి థ్రిల్లింగ్ చేస్తుంది. మరి ఆ సినిమా ఏంటనేది వివరాలు చూద్దాం…
‘వదంతి: ది మిస్టరీ ఆఫ్ మణి’:
2022లో విడుదలైన తమిళ బ్లాక్ బస్టర్ క్రైమ్ థ్రిల్లర్ ‘వదంతి’. ఇపుడు రెండో సీజన్ ‘వదంతి: ది మిస్టరీ ఆఫ్ మణి’ పేరుతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. మలయాళ స్టార్ యాక్టర్ M.శశికుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్లో అనఘ, అపర్ణ దాస్, యశ్వంత్ కీలక పాత్రలు పోషించారు.
లేటెస్ట్గా ఈ సిరీస్ ఓటీటీలో రిలీజై విపరీతంగా ఆకట్టుకుంటుంది. ట్విస్టులు, సీట్ ఎడ్జ్ సస్పెన్స్తో సాగిన ఈ సిరీస్.. థ్రిల్లర్ లవర్స్ కోసం డిజైన్ చేసిన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 8 ఎపిసోడ్లతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఆడియన్స్ ని కట్టిపడేస్తుంది. ఈ వెబ్ సిరీస్కు ‘విక్రమ్ వేద’ వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాన్ని అందించిన పుష్కర్-గాయత్రి క్రియేటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. తొలి సీజన్కు దర్శకత్వం వహించిన ఆండ్రూ లూయిస్ ఈ సీజన్కు కూడా రచయిత, దర్శకుడు, క్రియేటర్గా బాధ్యతలు నిర్వర్తించారు.
a little mystery added to your weekend plans 👀#VadhandhiOnPrime, New Season, Watch Now pic.twitter.com/gtUdTIhQyT
— prime video IN (@PrimeVideoIN) August 9, 2026
కథేంటంటే:
మధురైలో హైవే నిర్మాణం సందర్భంగా బయటపడిన అస్థిపంజరం ఓ సంచలన హత్య కేసుకు దారితీస్తుంది. దర్యాప్తు చేపట్టిన ఎస్ఐ మూసా రాజా (శశికుమార్).. ఈ కేసులో ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న మణి అనే ఖైదీని కలుసుకుంటాడు. అయితే మణి ప్రవర్తన, కేసులోని కొన్ని ఆధారాలు అతడే హంతకుడా అనే అనుమానాన్ని కలిగిస్తాయి. నిజనిజాలు తెలుసుకునేందుకు మూసా రాజా లోతుగా దర్యాప్తు మొదలుపెట్టడంతో రాజకీయ ఒత్తిళ్లు, మీడియా కథనాలు, దాగిన రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. మణి చుట్టూ దాగి ఉన్న అసలు నిజమేంటి? అస్థిపంజరం వెనుక మిస్టరీ ఏంటి? నిజాన్ని వెలికితీసే క్రమంలో మూసా రాజా ఎదుర్కొన్న సవాళ్లే ఈ క్రైమ్ థ్రిల్లర్ కథ.
విశ్లేషణ
అస్థిపంజరం చుట్టూ మొదలయ్యే మిస్టరీ: హైవే నిర్మాణంలో అస్థిపంజరం బయటపడటం కథకు బలమైన హుక్. అది ఎవరిది? హత్య ఎప్పుడు జరిగింది? దాని వెనుక ఎవరు ఉన్నారు? అనే ప్రశ్నలు మొదటి నుంచే ఆసక్తిని పెంచుతాయి.
మణి పాత్రే ప్రధాన సస్పెన్స్ పాయింట్: ఇప్పటికే జైలులో ఉన్న మణి ఈ కేసుతో ఎలా సంబంధం కలిగి ఉన్నాడు అనేది కథలో కీలకం. అతడే నిజమైన హంతకుడా? లేక మరొకరిని కాపాడేందుకు నిందను భరిస్తున్నాడా? అనే అనుమానం ప్రేక్షకుడిని చివరి వరకు వెంటాడే అవకాశం ఉంది.
మూసా పాత్రలో ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్: ఎస్ఐ మూసా రాజా దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఒక్కో రహస్యం బయటపడటం కథకు బలం. ముఖ్యంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్తో పాటు రాజకీయ ఒత్తిళ్లు, మీడియా ప్రభావం కలవడం వల్ల కథ కేవలం ‘హంతకుడు ఎవరు?’ అనే ప్రశ్నకే పరిమితం కాకుండా వ్యవస్థలోని మరో కోణాన్ని చూపించే అవకాశం ఉంది.
ట్విస్టులే ప్రధాన బలం:
ఈ తరహా క్రైమ్ థ్రిల్లర్లలో ప్రేక్షకుడికి ముందుగానే క్లూ ఇవ్వకుండా, ప్రతి ఎపిసోడ్ చివర్లో కొత్త ప్రశ్నను వదలడం చాలా కీలకం. 8 ఎపిసోడ్ల ఫార్మాట్ ఈ కథకు బాగా సరిపోయేలా ఉంది. ఒక మిస్టరీకి సమాధానం దొరికిన వెంటనే మరో మిస్టరీ మొదలైతే బింజ్-వాచింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. మొత్తంగా:
‘వదంతి: ది మిస్టరీ ఆఫ్ మణి’లో అస్థిపంజరం ఒక మిస్టరీకి మాత్రమే ఆరంభం. అసలు ఆసక్తి మణి ఎవరు? అతని గతం ఏంటి? మూసా రాజా దర్యాప్తులో బయటపడే నిజం ఏమిటి? అనే ప్రశ్నల్లో ఉంటుంది. ఈ ప్రశ్నలకు సమాధానాలను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ ప్రేక్షకుడిని చివరి ఎపిసోడ్ వరకు కూర్చోబెట్టడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.