
గ్రేటర్ వరంగల్, వెలుగు: వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ సమస్యను పరిష్కరించాలని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి కోరారు. గురువారం హైదరాబాద్లో మంత్రిని కలిసి పాలిటెక్నిక్ కాలేజీ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ ప్రభుత్వ పాలిటెక్నిక్లకు సంబంధించిన జీవో 97 విషయంలో విద్యార్థులు, లెక్చరర్లలో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలన్నారు.
పాలిటెక్నిక్ వ్యవస్థ బలోపేతం, విద్యార్థుల భవిష్యత్ పరిరక్షణ, కాలేజీల అభివృద్ధి, లెక్చరర్ల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం సానుకూలంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.