
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ ను ఎమ్మెల్యే కూచుకుల రాజేశ్రెడ్డి పంపిణీ చేశారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో లబ్ధిదారులతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి పొందవచ్చన్నారు. ఇండ్ల పనులు వేగంగా జరిగేలా అధికారులు, ప్రజాప్రతినిధులు పని చేయాలని కోరారు.