
Chhattisgarh: ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో జరిగిన ఐఈడీ పేలుడులో గాయాలపాలైన ముగ్గురు డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్(DRG) మరణించారు. మావోయిస్టుల కోసం అమర్చిన మందుపాతరను తొలగిస్తుండగా ఈ పేలుడు జరిగింది. గాయాలపాలైన ముగ్గురు జవాన్లు చికిత్స పొందుతూ మరణించినట్లు శనివారం అధికారులు తెలిపారు. మరో జవాన్ గాయపడ్డారు. నారాయణపూర్ జిల్లా సరిహద్దు సమీపంలో బోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నక్సలైట్లు గతంలో అమర్చిన ఐఈడీని గుర్తించి, దానిని నిర్వీర్యం చేసే ఆపరేషన్ చేస్తుండగా పేలుడు సంభవించింది. మార్చి 31న ఛత్తీస్గఢ్ రాష్ట్రం మావోయిస్టుల ప్రభావం నుంచి విముక్తమైందని ప్రకటించిన తర్వాత, ఇలా పేలుడు జరగడం ఇదే తొలిసారి.