
తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఫేజ్-1 ఎన్నికలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. వేసవి కాలం కావడంతో పెద్ద ఎత్తున ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల దగ్గరకు తరలివచ్చారు. ఇక ఎటువంటి ఉద్రిక్తతలు జరగకుండా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా పోలింగ్ ప్రారంభంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడులోని శివగంగ జిల్లా కారైకుడిలోని ఒక పోలింగ్ కేంద్రంలో చిదంబరం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత సిరా చుక్క ఉన్న వేలిని మీడియాకు చూపించారు.
బెంగాల్లో మొత్తం 294 స్థానాలు ఉండగా ఈరోజు 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. సుమారు 3.6 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక్కడ ప్రధానంగా బీజేపీ-తృణమూల్ కాంగ్రెస్ మధ్య ఫైటింగ్ జరుగుతోంది. ఇక తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ డీఎంకే-ఎన్డీఏ కూటమి, టీవీకే పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నడుస్తోంది. 234 నియోజకవర్గాల్లో 4,023 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 5.73 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
#WATCH | Tamil Nadu Elections 2026 | Senior Congress leader P Chidambaram casts his vote and shows his inked finger, at a polling station in Karaikudi, Sivaganga. pic.twitter.com/5rRqLmFtCk
— ANI (@ANI) April 23, 2026