Reading Time: < 1 minute
Iran President Pezeshkian Trump Nuclear Rights Warning

Iran: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికాల మధ్య రెండో రౌండ్ శాంతి చర్చలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. మరోవైపు, యూఎస్, ఇరాన్ మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తన దేశ అణు హక్కుల విషయంలో రాజీ పడే ఛాన్సే లేనది స్పష్టం చేశారు. ఇరాన్ ఏం చేయాలి, ఏం చేయకూడదని చెప్పడానికి ట్రంప్ ఎవరు? అని ప్రశ్నించారు. ఇరాన్ తన అణు హక్కులను వినియోగించుకోకూడదని చెబుతున్న అమెరికా, దానికి కారణాలు చెప్పలేకపోతోందని అన్నారు. మా దేశ హక్కుల్ని లాక్కోవడానికి ట్రంప్ ఎవరంటూ అడిగారు.

Read Also: Rammohan Naidu : మహిళా బిల్లును అడ్డుకోవడం కాంగ్రెస్ చేసిన క్షమించరాని పాపం

ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని అడ్డుకోవడమే తమ లక్ష్యమని అమెరికా స్పష్టంగా చెబుతోంది. తమ వద్ద అణ్వాయుధాలు లేవని ఇరాన్ పదే పదే చెబుతోంది. తమ అణు కార్యక్రమాలు దేశ శాంతియుత ప్రయోజనాలకే అని పేర్కొంటోంది. ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, అయితే ఒత్తిడి పెట్టినా తాము వెనక్కి తగ్గబోమని పెజెష్కియాన్ పేర్కొన్నారు. ఈ సంఘర్షణ గౌరవప్రదంగా ముగిసేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.