Reading Time: < 1 minute
Miss India 2026 Winner Sadhvi Satish Sail Goa Grand Finale

Miss India 2026 Winner: దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘మిస్ ఇండియా 2026’ (61వ ఎడిషన్) పోటీలు శనివారం రాత్రి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఘనంగా ముగిశాయి. ‘పుత్రికాభిమానం’ (Daughters of This Soil) థీమ్‌తో జరిగిన ఈ వేడుకలో గోవాకు చెందిన సాధ్వి సతీష్ సెయిల్ మిస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.

READ ALSO: Lenin: అఖిల్ ‘లెనిన్’ కోసం రంగంలోకి నాగార్జున.. ఫైనల్ కట్‌లో మార్పులు?

కిరీటాన్ని అలంకరించిన నికితా పోర్వాల్
కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (KIIT) వేదికగా జరిగిన ఈ గ్రాండ్ ఫినాలేలో.. గత ఏడాది విజేత నికితా పోర్వాల్.. సాధ్వికి మిస్ ఇండియా కిరీటాన్ని అలంకరించారు. ఈ విజయంతో సాధ్వి ‘మిస్ వరల్డ్ 2027’ పోటీల్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ప్రముఖ నటుడు మనీష్ పాల్, సారా జేన్ డయాస్ ఈ వేడుకకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా.. ఇషాన్ ఖట్టర్ వంటి స్టార్ల ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి.

టాప్-3 విజేతలు వీరే..
ఈ వేడుకల్లో గోవాకు చెందిన సాధ్వి సతీష్ సెయిల్ విజేతగా నిలిచారు. ఈ పోటీలో సాధ్వి సిల్వర్, బ్లాక్ కలర్ మోనోక్రోమాటిక్ గౌనులో మెరిసిపోయారు. ఆమె దుస్తులు వినూత్నంగా ఉన్నాయి. హై-నెక్, స్లీవ్‌లెస్ కట్ ఆమె ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయి. ఈ పోటీలో ఫస్ట్ రన్నరప్‌గా మహారాష్ట్రకు చెందిన రాజనందిని పవార్ నిలిచారు. మహారాష్ట్రకు చెందిన రాజనందిని పింక్ కలర్ గౌనులో ‘మోడ్రన్ ప్రిన్సెస్’లా కనిపించారు. వెండి స్పటికాలు, రాళ్లతో అలంకరించిన ఆమె హాల్టర్-స్టైల్ గౌను, హెయిర్ స్టైల్ క్లాసిక్ లుక్‌ను అందించాయి. సెకండ్ రన్నరప్ శ్రీ అద్వైత నిలిచారు. శ్రీ అద్వైత గోల్డ్ కల్లర్ ఈవినింగ్ గౌనులో తళతళలాడారు. ఆమె లుక్‌కు సిల్వర్ ఇయర్ రింగ్స్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. అందం, తెలివితేటలు, సమయస్ఫూర్తిని ప్రదర్శించిన ఈ ముగ్గురు భామలు నేటి యువతులకు స్ఫూర్తిగా నిలిచారు. ముఖ్యంగా మిస్ వరల్డ్ వేదికపై సాధ్వి సతీష్ సెయిల్ భారత్ కీర్తిని చాటుతారని విశ్లేషకులు భావిస్తున్నారు.

READ ALSO: HDFC & ICICI Bank Q4 Results: డబ్బులే డబ్బులు! ఒక్క ఏడాదే రూ.74 వేల కోట్ల లాభం.. బ్యాంకింగ్ దిగ్గజాల లాభాల పంట