
ఈ సమ్మర్ కూడా బోసిపోతుంది. ప్యారడైజ్, లెనిన్ తర్వాత పెద్ది ఇలా వరుసగా పోస్ట్ పోన్ అయ్యాయి. ముఖ్యంగా హై ఆక్టైన్ మూవీ పెద్ది వాయిదా ఫ్యాన్స్ను కొంత నిరాశ పరిచింది. కానీ టాలీవుడ్ ఫిల్మ్ గాయపడ్డ సింహం ఊపిరి పీల్చుకుంది. పెద్ది రాకపోవడంతో మే1న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. చరణ్- బుచ్చి ఫిల్మ్ డిలే.. తరుణ్ భాస్కర్ సినిమాకు కలిసొచ్చింది. కానీ పెద్ది వాయిదా.. టాలీవుడ్ కన్నా పొరుగు ఇండస్ట్రీలకు ప్లస్గా మారబోతుంది.
Also Read : NBK : యంగ్ డైరెక్టర్స్ ఫోకస్ అంతా ప్రజెంట్ బాలకృష్ణపైనే
సార్, కుబేరతో టాలీవుడ్ లేబుల్స్ ఉన్న సినిమాతోనే కాదు కోలీవుడ్ డబ్బింగ్ ఫిల్మ్ కరతో హిట్ కొట్టాలనుకుంటున్నాడు ధనుష్. లాస్ట్ ఫిల్మ్ ఇడ్లీ కడాయ్ ఇక్కడ రిలీజ్ చేసినప్పటికీ.. కాంతార చాప్టర్ 1 దెబ్బకు శాల్తీ గల్లంతైంది. ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయలేదు హీరో. ఇక తేరే ఇష్క్ మేను అమర కావ్యం పేరుతో రిలీజ్ చేస్తే పట్టించుకోలేదు తెలుగు ఆడియన్స్. కరతో ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తెలుగు మార్కెట్ కొల్లగొట్టానుకుంటే సరిపోదు.. ప్రమోషన్స్ కూడా చేయాలి.. మరీ కర కోసం ధనుష్ ఇక్కడ ప్రమోషన్స్ చేస్తాడో లేదో లెట్స్ వెయిట్. ఇక కన్నడ నుండి కేడీ ద డెవిల్ కూడా సిద్ధమౌతుంది. కానీ సెన్సార్ ఇష్యూస్ వల్ల బొమ్మ వస్తుందా అనేది ప్రస్తుతానికి డౌటే.
Also Read : Tollywood : రిలీజయ్యాక ఆడియన్స్ను థియేటర్స్కు రప్పించేందుకు పీక్స్ ప్రమోషన్స్ చేస్తోన్న హీరోస్
పెద్ది వాయిదా ఈ సౌత్ సినిమాలకే కాదు… నార్త్ నుండి బాలీవుడ్ టెస్ట్కు రెడీ అవుతోన్న సాయి పల్లవి ఏక్ దిన్ మూవీకి ప్లస్ అయ్యింది. అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్- సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ ఏక్ దిన్ను ఒక రోజుగా తెలుగులో తీసుకు వస్తున్నారు. మే1న థియేటర్స్లో సందడి చేయబోతుంది ఫిల్మ్. గత ఏడాదే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అమీర్ ఖాన్ జోక్యంతో లేటయ్యింది. మరాఠా యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ రాజా శివాజీ కూడా మే1నే రిలీజౌతోంది. రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా జంటగా నటించిన ఈ ఫిల్మ్ ఇదే డేట్కు తీసుకు రావడం వెనుక ఓ సెంటిమెంట్ ఉంది. మే1న మహారాష్ట్ర అవతరణ దినోత్సవం నేపథ్యంలో అదే రోజు మూవీని తీసుకురావాలని సెంటిమెంట్ పెట్టుకున్నారు ఈ స్టార్ కపుల్. రితేశ్ దర్శకుడిగా, జెనీలియా నిర్మాతగా రిస్క్ చేస్తోన్న ఈ ఫిల్మ్ మేడేనే రిలీజ్ కాబోతుంది. మరీ వీటిల్లో సమ్మర్ విన్నర్ అయ్యేది ఎవరో…? టాలీవుడ్ బాక్సాఫీస్ కొల్లగొట్టేది ఎవరో..?