Reading Time: < 1 minute
Simhachalam Chandanotsavam Tickets Row Confusion Over Mla Quota And Online Booking

Simhachalam Chandanotsavam Tickets Row: సింహాచలం చందనోత్సవం టిక్కెట్లపై గందరగోళం కొనసాగుతోంది. ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ కేటాయింపులపై రచ్చ రాజుకుంది. ఒక్కొక్కరికి గరిష్టంగా 25 మాత్రమేనని యంత్రాంగం తేల్చి చెప్పేసింది. దీంతో ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తికి లోనైనట్టు తెలుస్తోంది. అధికారుల వైఖరికి నిరసనగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు టిక్కెట్లు తీసుకోవడానికి నిరాకరించినట్టు సమాచారం. అటు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సైతం టిక్కెట్ల పంచాయితీలకు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. గతంలో అలవాటైన విధానాలకు భిన్నంగా కొందరు ప్రజాప్రతినిధులకు ఎక్కువ టిక్కెట్లు కేటాయించి సిటీలో ఎమ్మెల్యేలను పట్టించుకోలేదనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Slum Dog Release: పూరీ-విజయ్ ‘స్లమ్‌ డాగ్’ రిలీజ్ ఆలస్యం.. అసలు కారణం ఏంటో తెలుసా?

ఈ ఏడాది సింహాచలం చందనోత్సవంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసి పర్య వేక్షణ బాధ్యతలు అప్పగించింది. అయితే, గత ఐదేళ్ల మాదిరిగానే ఈసారి ఉత్సవ టిక్కెట్లపై రచ్చ తప్పలేదు. 70 శాతం ఆన్ లైన్ విధానంలో విక్రయిస్తామని చెప్పగా బ్యాంకులు దగ్గర భక్తులు పడిగాపులు పడాల్సి వచ్చింది. 300 రూపాయల టిక్కెట్లు ఆన్‌లైన్‌లో కొంత మేర లభించగా… వెయ్యి, 1500 స్లాట్లు మాత్రం అర కొరగానే పంపిణీ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో చందనోత్సవం టిక్కెట్ల వ్యవహారం హాట్ హాట్ గా మారింది. రేపు అర్ధరాత్రి నుంచి ఉత్సవం ప్రారంభం కానుండగా ఎల్లుండి స్వా మివారి నిజరూప దర్శన భాగ్యం భక్తులకు లభిస్తుంది.