
శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఐపీఎల్ 2026లో కెప్టెన్సీ, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఆల్రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టుకు సారథ్యం వహిస్తూ.. వరుస విజయాలు అందిస్తున్నాడు. పీబీకేఎస్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్లలో 4 విజయాలు అందుకోగా, ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇక నాలుగు ఇన్నింగ్స్లలో 18, 50, 69, 66 పరుగులతో 203 రన్స్ చేశాడు. ఓ స్టన్నింగ్ క్యాచ్ అందుకుని నిపుణుల ప్రశంసలు అందుకుంటున్నాడు. పలు ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు అయ్యర్ నాయకత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
మాజీ భారత స్పిన్నర్ ఆర్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘కెప్టెన్సీ, బ్యాటింగ్, ఫీల్డింగ్.. అన్ని విభాగాల్లో శ్రేయస్ అయ్యర్ రాణిస్తున్నాడు. అయినా భారత జట్టు నాయకత్వ ప్రణాళికల్లో లేకపోతే.. అది అయ్యర్కు కాదు.. భారత జట్టుకే నష్టం. శ్రేయాస్ నాయకత్వ సామర్థ్యాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది’ అని సూచించారు. మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ కూడా అయ్యర్పై ప్రశంసలు కురిపించాడు. ‘ప్రస్తుతం శ్రేయస్ లాంటి కెప్టెన్సీ ఎవరూ చేయడం లేదు. ఫీల్డింగ్, బ్యాటింగ్లోనూ అతను అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రతి విభాగంలోనూ అతనే నంబర్ వన్’ అని కొనియాడాడు.
Also Read: Moeen Ali PSL vs IPL: ఐపీఎల్కు గుడ్బై చెప్పి పీఎస్ఎల్కు.. అసలు కారణం ఏంటో చెప్పిన మొయిన్ అలీ!
మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ… ‘కెప్టెన్సీ వల్ల శ్రేయస్ అయ్యర్ ఆట మరింత మెరుగైంది. టాక్టికల్ అవగాహనతో పాటు నిలకడైన బ్యాటింగ్ ప్రదర్శన అతన్ని ప్రూవెన్ లీడర్గా నిలబెట్టాయి. శ్రేఐస్ జట్టుకు కీలక ఆటగాడు’ అని పేర్కొన్నాడు. వెస్ట్ ఇండీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ బిషప్ కూడా అయ్యర్ నాయకత్వంపై ప్రశంసలు గుప్పించాడు. ‘శ్రేయస్ జట్టులో విజయం సాధించే నమ్మకాన్ని తీసుకొచ్చాడు. ఐపీఎల్ 2026లో పంజాబ్ అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఈ స్టార్ ఆడిగాడి ప్రదర్శన అద్భుతంగా ఉంది’ అని వ్యాఖ్యానించాడు. మొత్తంగా శ్రేయస్ కెప్టెన్సీపై క్రికెట్ దిగ్గజాల నుంచి వస్తున్న ఈ ప్రశంసలు అతని నాయకత్వ ప్రతిభను మరింత స్పష్టం చేస్తున్నాయి. భవిష్యత్తులో భారత జట్టుకు కీలక నాయకుడిగా ఎదగగల సామర్థ్యం అతనిలో ఉందని నిపుణులు భావిస్తున్నారు.