
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో, పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్, నభా నటేష్ నటిస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండటంతో ఆడియోపై భారీ అంచనాలు ఉన్నాయి. పిక్సెల్ స్టూడియోస్పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. అయితే ఇప్పుడు బాక్సాఫీస్ కంటే ముందే తన ఓటీటీ డీల్తో ఇండస్ట్రీని ఆశ్చర్యపరుస్తోంది.తాజా సమాచారం ప్రకారం ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా కోసం ఒక వినూత్నమైన ‘పర్ఫార్మెన్స్ బేస్డ్’ ఒప్పందాన్ని ప్రతిపాదించినట్లు సమాచారం.
Also Read : VD15: ‘హాయ్ నాన్న’ డైరెక్టర్తో విజయ్.. పవర్ఫుల్ పోస్టర్తో సర్ప్రైజ్
సాధారణంగా ఒక సినిమా హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? అన్న దానితో సంబంధం లేకుండా రిలీజ్కు ముందే భారీ రేటుకు ఓటీటీ సంస్థలు రైట్స్ కొనేస్తుంటాయి. కానీ ‘స్వయంభు’ విషయంలో నెట్ఫ్లిక్స్ సరికొత్త రూల్ను తెరపైకి తెచ్చింది. ఏంటది అంటే ఈ సినిమా థియేటర్లలో ఎంత నెట్ కలెక్షన్ (Nett Collection) సాధిస్తుందో, అందులో సరిగ్గా సగం మొత్తాన్ని (50%) డిజిటల్ రైట్స్ కింద నెట్ఫ్లిక్స్ చెల్లిస్తుంది. అంటే సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు వసూలు చేస్తే, ఓటీటీ హక్కుల కోసం రూ. 50 కోట్లు దక్కుతాయి. ఒకవేళ వసూళ్లు రూ. 150 కోట్లు దాటితే, ఆ మేరకు ఓటీటీ రేటు కూడా భారీగా పెరుగుతుంది.
అంటే ఇది ఒక రకంగా నిర్మాతలకు డబుల్ ఎడ్జ్ స్వోర్డ్ లాంటిది. కంటెంట్ మీద నమ్మకం ఉండి సినిమా బ్లాక్ బస్టర్ అయితే, ఊహించిన దానికంటే రెట్టింపు ఆదాయం వస్తుంది. అదే సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోతే ఓటీటీ ఆదాయం కూడా తగ్గుతుంది. ఇటీవల భారీ రేట్లకు కొన్న సినిమాలు ఓటీటీలో వ్యూస్ రాబట్టలేకపోతుండటంతో, తమ రిస్క్ను తగ్గించుకోవడానికి నెట్ఫ్లిక్స్ ఈ పద్ధతిని ఎంచుకుందట.