ఉల్లిపాయలతో చేసిన పకోడిని ఎప్పుడు తింటూనే ఉంటారు అలా కాకుండా ఈ సారి కొత్తగా ట్రై చేయండి. ఒక కప్పు గోధుమ పిండి, రెండు పచ్చిమిర్చితో అదిరిపోయే పొలం పకోడి తయారు చేసుకుని సాయంత్రం పూట ఫ్యామిలీతో అందరూ హ్యాపీగా తినొచ్చు. మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..
గోధుమ పిండి పకోడికి కావాల్సిన పదార్ధాలు : రెండు కప్పుల గోధుమ పిండి , ఒక కప్పు శెనగపిండి, కొద్దిగా బియ్యపు పిండి, ఇంకా నాలుగు ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 10 కరివేపాకు ఆకులు, అర కట్ట కొత్తిమీర, రుచికి సరిపడా కారం, కొద్దిగా ఉప్పు, ఇంకా అర టేబుల్ స్పూన్ జీలకర్ర, సోడా ఉప్పు, నాలుగు టేబుల్ స్పూన్స్ నూనెను కూడా తీసుకోవాలి.
గోధుమ పిండి పకోడి ఎలా చేయాలంటే? ముందుగా గోధుమ పిండిని ఒక మీడియం సైజ్ గిన్నెలో తీసుకుని దానిలో కొద్దిగా నీళ్ళు పోసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా శెనగ పిండి కూడా వేసుకుంటే వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇంకా దీనిలో మీరు తినాలి అనుకుంటే బియ్యపు పిండి కూడా తీసుకోవచ్చు.మరి ఎక్కువగా కాకుండా ఒక టేబుల్ స్పూన్ బియ్యపు పిండి వేసుకోవాలి.
ఇంకా దీనిలో నాలుగు పచ్చిమిర్చి, అర టీ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు , కరివేపాకు, కొత్తిమీర ఆకులు దీనిలో వేసి కలుపుకోవాలి. ఇంకా మీరు వంటకు వాడే ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇంకా అవసరమైతే దీనిలో నీళ్లు కూడా వేసి తయారు చేసుకోవాలి.
గోధుమ పకోడీలను ఎర్రగా వేయించాలి : ఈ పిండి మిశ్రమంలో పొంగడానికి కొద్దిగా సోడా ఉప్పు వేస్తే క్రిస్పీగా.. నోటికి మంచి రుచితో అదిరిపోతోంది. ఇక ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఒక కళాయి పెట్టి దానిలో ఆయిల్ చేసి అది వేడయ్యాక, చిన్న ముద్దలుగా తీసుకుని కొద్దీ కొద్దిగా నూనెలో వేయాలి. బంగారు కలర్లోకి మారే వరకు బాగా వేయించుకోవాలి.




