Reading Time: 2 minutes

పోలీసులు నన్ను కర్రలు, పైపులతో కొట్టారు.. బంగ్లాదేశ్ క్రికెటర్ సంచలన ఆరోపణలు

Caption of Image.

Chattogram Controversy: బంగ్లాదేశ్ క్రికెట్‌లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఆ దేశ జాతీయ జట్టు స్పిన్నర్ నయీమ్ హసన్‌పై చిట్టగాంగ్‌లోని లాల్‌ఖాన్ బజార్ ఏరియాలో పోలీసులు దారుణంగా లాఠీఛార్జ్ చేశారు. ఢాకా ప్రీమియర్ లీగ్ మ్యాచ్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. 

నేను క్రికెటర్‌నని చెప్పినా వినలేదు: 
తాను జాతీయ క్రికెటర్‌నని ఎంత మొత్తుకుంటున్నా వినకుండా, పోలీసులు ప్లాస్టిక్ పైపులు, లాఠీలతో విచక్షణారహితంగా కొట్టారని నయీమ్ హసన్‌ స్థానిక మీడియా ముందు ఎమోషనల్ అయ్యాడు. తనను పోలీస్ వెహికల్‌లో కాకుండా ఆటోలో ఎక్కించడానికి ప్రయత్నించారని, ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లగా అక్కడి ఆఫీసర్ ఇన్‌ఛార్జ్ కూడా కళ్లు దించుకుని మాట్లాడాలంటూ తనతో రూడ్‌గా ప్రవర్తించాడని బంగ్లా క్రికెటర్ ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు తనపై ఎందుకు దాడి చేశారో కూడా చెప్పలేదు, ఈ అనాగరిక చర్యపై తనకు ఖచ్చితంగా న్యాయం జరగాలని, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని నయీమ్ హసన్‌ డిమాండ్ చేశాడు.

తప్పు చేసిన వాళ్లను వదిలిపెట్టేది లేదు: పోలీస్ అధికారి
ఈ ఘటనపై చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ అమీరుల్ ఇస్లాం మాట్లాడుతూ.. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ సమయంలో పోలీసులు సరైన నియమ నిబంధనలు పాటించలేదని అర్థమవుతోందని ఒప్పుకున్నారు. నయీమ్ హసన్‌ కు ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని, ఈ ఇన్సిడెంట్‌లో తప్పు చేసిన అధికారులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.

ALSO READ : కేటీ పెర్రీ హై-ఫైవ్.. ఇగ్నోర్ చేసిన కుర్రాడు..

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీవ్ర ఆగ్రహం: 
మరోవైపు జాతీయ జట్టు ప్లేయర్‌పై ఇలాంటి దాడి జరగడంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశం తరఫున ఆడే ఒక అథ్లెట్‌ పట్ల ఇలా అనాగరికంగా ప్రవర్తించడం చాలా విచారకరం, ఈ విషయాన్ని బోర్డు అత్యంత సీరియస్‌గా తీసుకుంటోందని పేర్కొంది. దీనిపై వెంటనే సమగ్రమైన ఎంక్వైరీ జరిపి, బాధ్యులైన పోలీస్ సిబ్బందిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత ప్రభుత్వ అధికారులను బీసీబీ డిమాండ్ చేసింది. 

©️ VIL Media Pvt Ltd.