Reading Time: < 1 minute

వనస్థలిపురంలో లింగ నిర్ధారణ పరీక్షలు..డికాయ్ ఆపరేషన్ చేపట్టి, ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు

Caption of Image.

ఎల్బీనగర్, వెలుగు: వనస్థలిపురంలోని హయగ్రీవ హాస్పిటల్‌‌లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు శనివారం డికాయ్​ఆపరేషన్​చేపట్టారు. ఇందులో భాగంగా ఓ మహిళా పోలీసును పేషెంట్​గా హాస్పిటల్‌‌కు పంపారు. ఆస్పత్రి డైరెక్టర్ కొర్ర రాజు, రిసెప్షనిస్టు లోకేశ్​ను లింగ నిర్ధారణ చేయాలని అడిగారు. 

వారు తమకు తెలిసిన తుక్కుగూడలోని శ్రీ సాయి ధనుష్ క్లినిక్ లో ల్యాబ్ టెక్నీషియన్‌‌గా చేస్తున్న విజయ్ కుమార్ వద్దకు వెళ్లాలని సూచించారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి, లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న విజయ్ కుమార్ ను, అతనికి సహకరిస్తున్న రాజు,లోకేశ్​ను అరెస్ట్ చేసి రిమాండ్ కు  తరలించారు. 

©️ VIL Media Pvt Ltd.