
Modi-Trump Meet: వచ్చే వారం ఫ్రాన్స్లో జరగనున్న జీ7 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య భేటీ ఉంటుదని శనివారం వైట్హౌజ్ ధ్రువీకరించింది. ఇరువురు నేతల మధ్య అంతర్జాతీయ రాజకీయాలు, ఇంధన భద్రత, మిడిల్ ఈస్ట్ పరిస్థితుల వంటి కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రధాని తన వారం రోజు పర్యటన ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటన కోసం బయలుదేరారు. పర్యటకు వెళ్లడానికి ముందు భారతదేశ వ్యూహాత్మక దృష్టిలో ఫ్రాన్స్కు ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని మోడీ అన్నారు. 1993లో స్లోవేకియా స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి.
జీ7 సదస్సులో హార్ముజ్ జలసంధి భద్రతకు సంబంధించి ప్రధాన చర్చాంశంగా మారనుంది. ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో హార్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపుపై ట్రంప్ మిత్రదేశాలతో చర్చించినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. ఈ కీలక సముద్ర మార్గాన్ని తిరిగి పూర్తిస్థాయిలో తెరవడానికి బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు సహకరించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రస్తుతం, ఇరాన్ అమెరికా మద్య ఒప్పందం కుదిరే అవకాశం కనిపిస్తోంది. ఒప్పందం కుదిరితే ప్రస్తుత సంక్షోభానికి తెరపడుతుంది.