
హైదరాబాద్, వెలుగు: మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఎన్నికల నామినేషన్ ను తిరస్కరించడంపై మహిళా కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. కేసు విచారణ సందర్భంగా కోర్టు బయట, గాంధీ భవన్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడారు. మీనాక్షి నామినేషన్ తిరస్కరణ రాజ్యాంగంపై బీజేపీ చేసిన దాడి అని పేర్కొన్నారు. దేశంలో ఓట్ చోరీతో పాటు సీటు చోరీకి బీజేపీ పాల్పడుతున్నదని మండిపడ్డారు.