
ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ.. కానీ అత్యంత అపార్థం చేసుకున్న సంస్థ కూడా అని మోహన్ భగవత్ అన్నారు. ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా కేరళ రాజధాని తిరువనంతపురంలో మోహన్ భగవత్ మాట్లాడారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అని, అదే సమయంలో అత్యంత అపార్థం చేసుకున్న సంస్థల్లో ఒకటిగా కూడా ఉందని వ్యాఖ్యానించారు. అందుకే ఈ కార్యక్రమాన్ని ఆర్ఎస్ఎస్ గురించి ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఆర్ఎస్ఎస్ను బయట నుంచి చూసే వారు తరచుగా తప్పుగా అర్థం చేసుకుంటారని పేర్కొన్నారు. స్వయంసేవకులు యూనిఫామ్లతో నిర్వహించే పథసంచలనాలు (రూట్ మార్చ్లు) చూసి కొందరు దీనిని పారామిలిటరీ సంస్థగా భావిస్తారని చెప్పారు. అలాగే భారతీయ సాంప్రదాయ క్రీడలు, వ్యాయామాలు, యుద్ధ కళలకు సంఘ్ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మరికొందరు దీనిని కేవలం ఒక పెద్ద వ్యాయామశాల లేదా ఫిట్నెస్ సంస్థగా చూస్తారని వ్యాఖ్యానించారు. “కానీ సంఘ్ కేవలం అవి మాత్రమే కాదు. బయట నుంచి చూసి సంఘ్ను పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టం” అని భగవత్ స్పష్టం చేశారు.
1925లో స్థాపించబడిన ఆర్ఎస్ఎస్ ప్రస్తుతం తన శతాబ్ది సంవత్సరాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలోని అన్ని వర్గాలతో మరింత సన్నిహితంగా మమేకమవడానికి సంఘ్ ప్రయత్నిస్తోంది. సంఘ్ లక్ష్యాలు, కార్యకలాపాలపై ఉన్న అపోహలను తొలగించి ప్రజలకు వాస్తవాలను చేరవేయడమే ఈ శతాబ్ది ఉత్సవాల ప్రధాన ఉద్దేశమని మోహన్ భగవత్ తెలిపారు.
VIDEO | Thiruvananthapuram, Kerala: RSS chief Mohan Bhagwat says, “This programme has been organised to provide an opportunity to understand an organisation that is often misunderstood. People say it is the largest voluntary organisation in the world, and at the same time, one of… pic.twitter.com/IBUrtMOEHc
— Press Trust of India (@PTI_News) June 13, 2026