
ఉప్పల్, వెలుగు: ఉప్పల్భగాయత్లోని ఓ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. రాయల్రిడ్జి అపార్ట్మెంట్నాలుగో ఫ్లోర్- 401 ఫ్లాట్లో కులదీప్అనే వ్యాపారి ఉంటున్నారు. గురువారం రాత్రి ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లాడు. తర్వాత ఏసీ యూనిట్లో మంటలు అంటుకొని, దట్టమైన పొగ కమ్మేసింది.
స్థానికులు గమనించి ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి, మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో బెడ్ రూమ్లోని ఫర్నిచర్ దగ్ధమైందని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు.