Reading Time: 2 minutes

ఆఫ్ఘన్ ఆలౌట్.. భారత జట్టు టార్గెట్ ఎంతంటే!

Caption of Image.

IND AFG 1st ODI: ధర్మశాలలోని హెచ్‌పీసీఏ (HPCA) స్టేడియంలో భారత్ తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచులో ఆఫ్ఘనిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌట్ అయింది. మొదట బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘన్ కి ప్రారంభంలోనే బిగ్ షాట్ తగిలింది. కేవలం 26 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ మాత్రం భారత బౌలర్లపై చెలరేగి ఆడాడు. ఈ క్రమంలో తన సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. 

టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసేందుకు క్రీజులోకి వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ 13 పరుగుల దగ్గర డెబ్యూ బౌలర్ గుర్నూర్ బ్రార్ వేసిన ఓ అద్భుతమైన బంతిని భారీ షాట్ ఆడబోయి మిడాఫ్ లో ఉన్న శుభ్ మన్ గిల్ కి క్యాచ్ ఇచ్చి ఇబ్రహీం జద్రాన్ (1) పెవిలియన్ కు చేరగా, అనంతరం క్రీజులోకి వచ్చిన సెడిఖుల్లా అటల్ కూడా ఎక్కువ సేపు మైదానంలో నిలవలేకపోయాడు. అర్షదీప్ సింగ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రహ్మత్ షా కూడా అర్షదీప్ బౌలింగ్ లోనే మైదానం నుంచి నిష్క్రమించాడు. 

►ALSO READ | టీమిండియా బౌలర్ల దెబ్బకు ఆఫ్ఘన్ విలవిల.. 26 పరుగులకే 3 వికెట్లు డౌన్ 

అనంతరం గుర్బాజ్ ఒక్కేడ సెంచరీ (102)తో చెలరేగిన తర్వాత ఔట్ కావడంతో.. ఆఫ్ఘన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ (27) కూడా కాసేపు పోరాటం చేసినప్పటికీ.. దాన్ని పెద్ద స్కోర్ గా మలిచే క్రమంలో హర్ష్ దూబే బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ఒమర్జాయ్ (26)కాసేపు మెరుపులు మెరిపించినప్పటికీ, దూబే బౌలింగ్ లో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కి క్యాచ్ ఇచ్చి డగౌట్ కి వెళ్లిపోయాడు. 

ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు ఇలా వచ్చి అలా మైదానం బయటకి వెళ్లిపోవడంతో.. 24.5 ఓవర్లలోనే ఆఫ్ఘన్ కేవలం 194 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక భారత్ తరపున డెబ్యూ చేసిన హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ తలో 3 వికెట్లు పడగొట్టగా, అర్షదీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 

 

 

©️ VIL Media Pvt Ltd.