
నిఖిల్ హీరోగా హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో వస్తోన్న పాన్ ఇండియా సినిమా ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకుడు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించగా, శనివారం ఈ మూవీ ఫస్ట్ సింగిల్ అప్డేట్ అందించారు మేకర్స్.
రా రా ధీవర’ అంటూ సాగే పాటను ఏప్రిల్ 16న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో నిఖిల్ యోధుడి అవతారంలో, దట్టమైన అడవిలో నిలబడి, ఈటెను విసరడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు.
ఈ పాట ఎలా ఉండబోతోందో ఈ పోస్టర్ సూచిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇందులోని పాత్రకోసం నిఖిల్ దాదాపు రెండేళ్లు ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాడు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్గా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్గా సెంథిల్ కుమార్, ఎడిటర్గా తమ్మిరాజు వర్క్ చేస్తున్న ఈ చిత్రానికి విజయ్ కామిశెట్టి డైలాగ్స్ అందిస్తున్నారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేయనున్నారు.