July 12, 2026

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు
Reading Time: < 1 minute
Ap Government Key Decision Refund Of Application Fees For Unallotted Tidco Houses

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం తాజాగా టిడ్కో ఇళ్లకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. 83,865 మందికి గృహాల అలాట్‌మెంట్‌ కావని తేలిపోవడంతో.. వారికి రూపాయలు 174 కోట్లు తిరిగి చెల్లించాల్సి ఉందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ చర్య, టిడ్కో ఇళ్ల కొరకు ముందుగా దరఖాస్తు చేసిన వారు ఈ సొమ్ము తిరిగి పొందే అవకాశం రావడంతో.. వారికి అన్యాయం కాకుండా ఉందనే చెప్పాలి..

ఇక, 1,00,875 టిడ్కో ఇళ్లకు గృహప్రవేశం చేసే ప్లాన్ కూడా త్వరలో ప్రారంభం అవుతుంది. అనంతరం, రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో బిల్డింగ్ డోర్స్ కు క్యూఆర్ కోడ్ నెంబర్లు జతచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాగునీరు కలుషితం కాకుండా, స్మార్ట్ వాటర్ పైప్ లైన్ తయారీకి గ్రిడ్ ప్రణాళిక అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. మున్సిపల్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా 100 రోజుల ప్రణాళిక కోసం 123 యూఎల్బీల్లో మౌలిక వసతుల అమలు కూడా ప్రారంభం అవుతోంది. అన్న క్యాంటిన్లు ప్రారంభించడం దిశగా 70 అన్న క్యాంటిన్లు త్వరలో ప్రారంభం అవుతాయని సీఎం తెలిపారు.

– టిడ్కో ఇళ్లకు దరఖాస్తు చేసిన వారికి తిరిగి 174 కోట్లు చెల్లింపు..
– 1,00,875 టిడ్కో ఇళ్లకు గృహప్రవేశం
– స్మార్ట్ వాటర్ పైప్ లైన్ ప్రణాళిక
– 100 రోజుల ప్రణాళిక – 123 యూఎల్బీల్లో మౌలిక వసతులు
– అన్న క్యాంటిన్లు 70 కొత్తగా ప్రారంభం