Reading Time: < 1 minute
Hyderabad Drug Racket Busted Mdma Seized In Rajendranagar And Miyapur Bengaluru Link Exposed

Hyderabad Drug Racket Busted: హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ రాకెట్‌ స్థావరాలపై పోలీసులు గట్టి దెబ్బకొట్టారు. రాజేంద్రనగర్, మియాపూర్ ప్రాంతాల్లో వేర్వేరు ఆపరేషన్లలో భారీగా ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రెండు కేసుల్లోనూ బెంగళూరును అడ్డాగా చేసుకుని నగరానికి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Ram Gopal Varma: జీసస్, అల్లా మధ్య ఫైట్.. ఎవరు గెలిస్తే ఆ మతంలోకి మారతా..

ఈ దాడుల్లో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో సుమారు రూ.20 లక్షల విలువ చేసే 150 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒమన్, పాలస్తీనా దేశాలకు చెందిన ముగ్గురు విదేశీయులను అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలిస్తూ.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, బడా వ్యాపారులను టార్గెట్‌గా చేసుకుని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బెంగళూరును ప్రధాన కేంద్రంగా చేసుకుని ఈ ముఠా డ్రగ్స్ దందా నడుపుతున్నట్లు దర్యాప్తులో బయటపడింది. నిందితులపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

Most Wides and No-Balls: టీ20ల్లో అత్యధిక వైడ్లు, నోబాల్స్ లిస్ట్.. టాప్‌లో అర్షదీప్, బుమ్రా ప్లేస్ ఎక్కడుందో తెలుసా?

ఇక మియాపూర్ పరిధిలో కూడా డ్రగ్స్ కలకలం రేగింది. మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్స్ టీం (SOT) బృందం బెంగళూరు నుంచి కారులో హైదరాబాద్‌కు డ్రగ్ తరలిస్తుండగా ముగ్గురు యువకులను పట్టుకుంది. వారి వద్ద నుంచి 12.6 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకుంది. నిందితులు హైదరాబాద్‌కు చెందిన యువకులేనని, వారు కారులో బెంగళూరు వెళ్లి అక్కడ నైజీరియన్ల వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి నగరానికి తీసుకొస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసును మియాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేసి NDPS యాక్ట్ కింద దర్యాప్తు కొనసాగిస్తోంది.