
అమెరికా-, ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో సోమవారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం,10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.7,000 పెరిగి రూ.1.66 లక్షలకు చేరింది. కిలో వెండి రూ.20,000 పెరిగి రూ.2.87 లక్షలకు పెరిగింది. కమోడిటీ నిపుణుడు అజయ్ కేడియా మాట్లాడుతూ, బంగారం రూ.1.90 లక్షలు, వెండి రూ.3.50 లక్షలకు చేరవచ్చన్నారు. ప్రపంచ ఉద్రిక్తతలు, వడ్డీ రేటు తగ్గింపు అంచనాలతో ఈ విలువైన లోహాల ధరలు పెరిగాయి