Reading Time: < 1 minute
Up Cabinet Expansion Yogi Adityanath Focuses On Caste Equations Before 2027 Elections

Uttar Pradesh: 2027లో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో మూడోసారి అధికారంలోకి రావడానికి ఇప్పటి నుంచే బీజేపీ తన కార్యచరణను ప్రారంభించింది. ఆదివారం(రేపు) సాయంత్రం సీఎం యోగి ఆదిత్యనాథ్ తన మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది. క్యాబినెట్ లోకి ఆరుగురు కొత్త ముఖాలను తీసుకునే అవకాశం ఉంది.

Read Also: Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు

సీఎం యోగి ఈ రోజు సాయంత్రం గవర్నర్‌తో సమావేశం అవుతారని తెలుస్తోంది. మంత్రివర్గం విస్తరణ కోసమే ఈ భేటీ అని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. యోగి ప్రభుత్వంలో కొత్తగా సుమారు 9-10 మంది మంత్రులు చేరే అవకాశం ఉంది. ఇదే సమయంలో పలు శాఖల మార్పులు కూడా ఉంటాయనే వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి, మనోజ్ పాండే, అశోక్ కటారియా, సురేశ్ పాసి, సురేంద్ర దిలేర్, ఆశిష్ సింగ్ ఆశు, హన్స్‌రాజ్ విశ్వకర్మ, కృష్ణ పాశ్వాన్, పూజా పాల్ వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన లేదు.

మంత్రి వర్గ విస్తరణలో సంస్థాగత, సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేయనున్నారు. పార్టీని అలాగే ప్రభుత్వాన్ని రెండింటికి ప్రాధాన్యత ఇచ్చేలా బీజేపీ కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఓబీసీల్లో కుర్మి, గుర్జార్, పాల్, జాట్ సమాజిక వర్గాలకు చెందిన వారిని, ఎస్సీల్లో పాసి, వాల్మీకి వర్గాల వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల ముందు యూపీలో కుల సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ విస్తరణ జరుగనుంది.