
Anna Konidela: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొనిదెల ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ ఫ్యాన్స్తో పాటు ప్రజలందరూ ఆమె చేసిన పనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆమె తన పుట్టిన రోజు సందర్భంగా ఏం చేశారో తెలుసా.. వన్యప్రాణుల సంరక్షణకు అర్థవంతమైన ముందడుగు వేశారు. విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జూ పార్క్లో ఉన్న ఒక ఆసియా ఏనుగు, ఒక రాయల్ బెంగాల్ పులిని ఆమె తన పుట్టిన రోజు సందర్భంగా దత్తత తీసుకున్నారు.
ఈ రెండు జంతువుల ఏడాది సంరక్షణ, పోషకాహారం, వైద్య అవసరాల కోసం ఆమె రూ.6.30 లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ నిధులు జంతువుల సంక్షేమం, సంరక్షణ కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు జూ అధికారులు తెలిపారు. వన్యప్రాణుల పరిరక్షణపై అవగాహన పెంచే లక్ష్యంతో అన్నా కొనిదెల తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పాటు, పలువురు యానిమల్ లవర్స్ ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. బర్త్ డే లాంటి ప్రత్యేక సందర్భాలను సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలతో అనుసంధానం చేయడం ఆదర్శనీయమని అభిప్రాయపడుతున్నారు. ప్రకృతి, వన్యప్రాణుల సంరక్షణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఈ సందర్భంగా పర్యావరణ ప్రేమికులు కామెంట్స్ చేస్తున్నారు.