
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా ప్రమోషన్లు ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో లేవని మెగా అభిమానులు కొంత అసంతృప్తిగా ఉన్నారు. అయితే, ఈ లోటును పూడ్చేందుకు చిత్ర యూనిట్ ఒక భారీ ‘మైండ్ బ్లాకింగ్’ ప్లాన్తో సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సినిమా క్రీడా నేపథ్యం (స్పోర్ట్స్ డ్రామా), ముఖ్యంగా క్రికెట్ బ్యాక్డ్రాప్లో సాగుతుండటంతో, ప్రమోషన్ల కోసం ఒక అరుదైన అతిథిని తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, జార్ఖండ్ రాజధాని రాంచీలో ఒక భారీ ఈవెంట్ను నిర్వహించాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ వేడుకకు భారత మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)ని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని చూస్తున్నట్టు గట్టిగా వినిపిస్తోంది. ధోనీ స్వస్థలం రాంచీ కావడం, అలాగే సినిమా క్రీడా నేపథ్యంలో ఉండటంతో ఆయన రాక సినిమాకు భారీ హైప్ తీసుకొస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. ప్రస్తుతానికి ధోనీతో సంప్రదింపులు జరుగుతున్నాయని, ఇంకా ఏదీ అధికారికంగా ఖరారు కాలేదని తెలుస్తోంది. ఒకవేళ ధోనీ ఈ ఈవెంట్కు హాజరైతే మాత్రం, నార్త్ ఇండియా మార్కెట్లో ‘పెద్ది’ సినిమాకు తిరుగులేని ప్రచారం లభిస్తుందని చెప్పొచ్చు. రామ్ చరణ్ మాస్ ఇమేజ్, ధోనీ క్రేజ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయం.