Reading Time: < 1 minute
Students Suffer Without Road Seek Deputy Cm Intervention

Andhra Pradesh: రహదారి సదుపాయం లేకపోవడంతో నిత్యం గెడ్డ దాటుకుంటూ.. నడక దారిలో పాఠశాలకు చేరుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నామని అనంతగిరి మండలంలోని కర్రిగెడ, కొట్టేంగుడ గ్రామాలకు చెందిన చిన్నారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు గ్రామాలకు చెందిన సుమారు 11 మంది విద్యార్థులు చదువుకునేందుకు బోడిగరువు గ్రామంలోని బడికి నాలుగు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్తున్నారు.

Read Also: రూ. 4,000 డిస్కౌంట్‌తో పాటు ఉచిత ఇయర్‌బడ్స్.. నేటి నుంచి iQOO 15R సేల్ షురూ..!

అయితే, ఈ మార్గ మధ్యలో గెడ్డ సైతం దాటాల్సిన పరిస్థితి నెలకొంది. పిల్లలు పాఠశాలకు వెళ్లి తిరిగి గ్రామానికి చేరుకునే వరకు తాము ఆందోళన చెందుతున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి రహదారి నిర్మించాలని కోరుతూ గెడ్డ మధ్యలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోని పట్టుకుని వేడుకున్నారు. కొండ దారిలో రాళ్లు గుట్టలపై పడుతూ లేస్తూ పాఠశాలకు చేరుకునేందుకు నడకదారిలో తీవ్ర అవస్థలు పడుతున్నామని చిన్నారులు ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Gold Rates: యుద్ధ సమయంలో గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు

కాబట్టి, రహదారి నిర్మించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలను పట్టుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. పిల్లలు పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చేంత వరకు ఎక్కడ ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో వాగులో నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో పిల్లలను బడికి పంపించలేని పరిస్థితి నెలకొంది అన్నారు. దీంతో వారి చదువు అటకెక్కుతోందని విలపించారు. రాను పోను వ్యయ ప్రయాసలు చెందాల్సి వస్తుందని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి.. మా గోడును ఉప ముఖ్యమంత్రికి విన్నవించాలని చిన్నారులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.