Reading Time: < 1 minute
Married Woman Dies By Suicide After Alleged Harassment In Yadadri Bhuvanagiri District

Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అత్తింటి వారి వేధింపులు భరించలేక ఓ వివాహిత తన ఇద్దరు చిన్నారులను చంపి, తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన బీబీనగర్ మండలం గొల్లగూడెంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

IND Playing 11 vs ENG: ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్‌.. భారత జట్టులో కీలక మార్పు, ఆ స్టార్ ప్లేయర్ అవుట్!

గొల్లగూడెం గ్రామానికి చెందిన ఐశ్వర్య అనే మహిళ తన ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఐశ్వర్య రాసిన సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. తన మరణానికి గల కారణాలను ఆమె ఆ లేఖలో పేర్కొంది. ఐశ్వర్య రాసిన లేఖలో తన అత్తగారి కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేసింది. తన ఆత్మహత్యకు అత్తింటి వారి వేధింపులే ప్రధాన కారణమని ఆమె పేర్కొంది. భర్త మేకల మహేష్ తన పట్ల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడని, కనీసం బట్టలు కూడా కొనిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

రూ. 4,000 డిస్కౌంట్‌తో పాటు ఉచిత ఇయర్‌బడ్స్.. నేటి నుంచి iQOO 15R సేల్ షురూ..!

తన భర్త ఆయన తల్లిదండ్రులు, సోదరి మాటలు విని తనను వేధించేవాడని లేఖలో రాసింది. తన పిల్లలను బాగా చదివించాలని కలలు కన్నానని, కానీ తాను లేకపోతే వారిని చూసేవారు ఎవరూ ఉండరనే ఆందోళనతోనే వారిని కూడా నాతో పాటు తీసుకెళ్తున్నానని (చంపేస్తున్నానని) లేఖలో పేర్కొంది. చివరగా తన మరణానికి కారణమైన భర్త, అత్త, మామ జీవితాంతం జైలులోనే ఉండాలని, అప్పుడే తన ఆత్మకు శాంతి కలుగుతుందని ఆమె లేఖలో రాసుకొచ్చింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు, సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.