ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. గతంలో వచ్చిన ‘స్టూడియో గిబ్లీ’ ఏఐ ట్రెండ్ తర్వాత.. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మరో సరికొత్త ట్రెండ్ వైరలవుతోంది. అదే వింటేజ్ 1980’s ట్రెండ్. దీని ప్రకారం నెటిజన్లు ఏఐ సాయంతో తమను తాము గత కాలానికి చెందిన రూపాల్లో మళ్లీ ఊహించుకుంటున్నారు.
చాట్జీపీటీ ఫ్రాంప్ట్ ను ఉపయోగించి నెటిజన్లు తమ కొత్త సెల్ఫీలను 1980 దశాబ్దం నాటి ఫొటోలుగా మార్చుకొని తెగ మురిసిపోతున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ 1980’s ట్రెండ్ ను తెగ ఇష్టపడుతున్నారు.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మొదలుకుని రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు, బుల్లితెర ప్రముఖులు తమ ఫొటోలను 1980s స్పెషల్ ఫొటోలుగా మార్చుకుని తెగ మురిసిపోతున్నారు. ఇక నెటిజన్లు కూడా తమ అభిమాన హీరోలు, హీరోయిన్లు 80ల నాటి తారలుగా మార్చేస్తున్నారు.
అలా తాజాగా దివంగత హీరో నందమూరి తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి తన ఫోటోలను 80s స్పెషల్ ఫొటోలుగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇప్పుడీ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు అలేఖ్య చాలా అందంగా, క్యూట్ గా ఉందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
అలేఖ్యతో పాటు పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర, యాంకర్ మంజూష, డైరెక్టర్ సుకుమార్- బబిత, సాయి పల్లవి, త్రిష.. ఇలా చాలా మంది సినీ ప్రముఖలు 1980s ఫొటోస్ ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి.




