
హైదరాబాద్ లో చెరువులు,ప్రభుత్వ స్థలాల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పడ్డ హైడ్రా దూకుడు పెంచింది. ఆక్రమణలపై ఎప్పటికప్పుడు కొరడా ఝుళిపిస్తూ ప్రభుత్వ స్థలాలను కాపాడుతోంది హైడ్రా. ఈ క్రమంలో శనివారం ( జులై 4 ) హైదరాబాద్ లోని గచ్చిబౌలి, కొండాపూర్ లో ఆక్రమణల తొలగింపు చేపట్టింది హైడ్రా. ఈ క్రమంలో గచ్చిబౌలి,కొండాపూర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
సీఎంసీ సిబ్బందితో కలిసి హైడ్రా చేపట్టిన ఈ ఆపరేషన్ లో కొండాపూర్ బొటానికల్ గార్డెన్ నుండి మసీదు బండ వరకు రోడ్డుకు ఇరువైపుల వెలసిన ఆక్రమణలు తొలగించారు అధికారులు.
ఇవాళ ఉదయం 4 గంటల నుండే ఆక్రమణల తొలగింపు చేపట్టారు హైడ్రా, సీఎంసీ సిబ్బంది. భారీ బందోబస్తు మధ్య ఆక్రమణలు చేపట్టారు అధికారులు.