Reading Time: 2 minutes

అక్రెడిటేషన్ల జారీలో అన్యాయాన్ని సరిదిద్దాలి: ఐ అండ్పీఆర్ ఎదుట డెస్క్ జర్నలిస్టుల ధర్నా

Caption of Image.

డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ల జారీలో జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని డెస్క్ జర్నలిస్టుల సంఘం(డీజేఎస్​) డిమాండ్​ చేసింది. 10–12 ఏండ్లకుపైగా సీనియారిటీ ఉన్న వారికి కూడా కార్డులు రావడం లేదని, అసంబద్ధమైన కారణాలను చూపుతూ అక్రెడిటేషన్లు నిరాకరరించడ సరికాదని విమర్శించింది. ఈ మేరకు డీజేఎస్​ ఆధ్వర్యంలో డెస్క్​ జర్నలిస్టులు సోమవారం (జూన్ 29)  ఐ అండ్​ పీఆర్ ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు. 

ఈ సందర్భంగా డీజేఎస్​ అధ్యక్షుడు బాదిని ఉపేందర్​ మాట్లాడుతూ పాత కార్డులపై కొనసాగుతన్న బస్​పాస్​ల గడువు జూన్ 30తో ముగుస్తున్నందున.. తక్షణం కొత్త అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్​ చేశారు.  గత రెండు, మూడు దఫాలుగా అక్రెడిటేషన్లు పొందిన, పదేండ్లకుపైగా అనుభవం ఉన్న ప్రతి డెస్క్ జర్నలిస్టుకు అక్రెడిటేషన్ కార్డు రాకపోవడం బాధకరమని.. వారందరికి వెంటనే కార్డులు ఇవ్వాలని కోరారు. 

అలాగే మహిళా జర్నలిస్టులు లేని చోట, ఆ కోటా కార్డులు అదే సంస్థలో పని చేస్తున్న అర్హులైన మిగతా జర్నలిస్టులకు ఇవ్వాలన్నారు. తెలంగాణలో దివ్యాంగులైన వర్కింగ్​ జర్నలిస్టులు అతి తక్కువ సంఖ్యలో ఉన్నారని.. మేనేజ్​మెంట్ల కోటాతో సంబంధం లేకుండా వారందరికి కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాల్లో అప్లికేషన్లను వెంటనే అప్రూవ్ ​చేసి తక్షణం కార్డులు అందజేయాలన్నారు.

►ALSO READ | తెలంగాణ పోలీసు శాఖలో ప్రమోషన్స్.. 36 మంది సీఐలకు డీఎస్పీలుగా పోస్టింగ్స్

 మండల స్థాయి విలేకరులకు అక్రెడిటేషన్​ కార్డులు ఇచ్చే విషయంలో మండలంలోని సర్క్యులేషన్​పై సీఏ సర్టిఫికెట్ కోరడం పూర్తిగా అసంబద్ధమన్నారు. పత్రికలు తమ మొత్తం సర్క్యులేషన్​పై కేంద్ర ప్రభుత్వం గుర్తింపు కలిగిన ఏబీసీ, పీఆర్‌‌జీఐ సర్టిఫికెట్లు సమర్పించాయని.. అయినప్పటికీ  మళ్లీ  సీఏ సర్టిఫికెట్ అడగడం మండల విలేకరులకు అక్రెడిటేషన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడమేనన్నారు. ఐ అండ్ పీఆర్​ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి గతంలో హామీ ఇచ్చినట్టుగా ఎక్కువ జనాభా కలిగిన మండలాల్లో మండల స్థాయి విలేకరులకు ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఇవ్వాలన్నారు. 

అనంతరం ఐ అండ్​ పీఆర్​ కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో.. డిమాండ్లతో కూడిన మెమొరాండంను ఐ అండ్​ పీఆర్ అడిషనల్​​ డైరెక్టర్ జగన్​ కు సమర్పించారు. దీనిపై ఆయన స్పందిస్తూ మెమొరాండంలో పేర్కొన్న సమస్యలను కమిషనర్​, మీడియా అకాడమీ చైర్మన్​ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కార్య్రమంలో డీజేఎస్​ ప్రధాన కార్యదర్శి కేఎన్​ రాజారామ్​, ట్రెజరర్ వి.వెంకటరమణ, జాయింట్​ సెక్రటరీ కనపర్తి రమేశ్​, రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి,పద్మ, సంఘం ప్రతినిధులు సిలివేరు వెంకటేశం, చల్లా సైదిరెడ్డి, రమేశ్​, అశోక్​, రమేశ్​, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.