
జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధి , మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పనులపై ఈ పర్యటనలో ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. కాళేశ్వరం చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. రేవంత్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, ఆలయ ప్రాంగణంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు. భక్తుల సౌకర్యార్థం కాళేశ్వరం క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం సూచనప్రాయంగా వెల్లడించింది.
VDxSHOURYUV : రౌడీ స్టార్ కోసం నేచురల్ స్టార్..విజయ్-నాని సందడి!
ఆలయ దర్శనం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు. గత కొంతకాలంగా వివాదాస్పదంగా మారిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు, ప్రస్తుత స్థితిగతులు , పునరుద్ధరణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. బ్యారేజ్ మరమ్మత్తులు ఎంతవరకు వచ్చాయి, వర్షాకాలం లోపు చేపట్టాల్సిన రక్షణ చర్యల గురించి ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన నేపథ్యంలో, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డను సందర్శించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాజెక్టు భద్రత , భవిష్యత్తు కార్యాచరణపై ఈ పర్యటన ద్వారా ఆయన అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు , ఉన్నతాధికారులు ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట ఉన్నారు.
Virat Kohli: కంఠీలు ధరించి, తిలకాలు పెట్టుకుని.. ప్రేమానంద మహారాజ్ వద్ద విరాట్-అనుష్క