Reading Time: 2 minutes
Ambati Rambabu Questions Amaravati Capital Plan Ap Financial Capacity

Ambati Rambabu: ప్రకాశం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు.. రాష్ట్ర రాజధాని అమరావతి అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో భారీ స్థాయిలో రాజధాని నిర్మాణం సాధ్యమేనా అని ప్రశ్నించారు. రాజధాని పేరుతో అప్పులు చేసి కొందరికి లాభాలు చేకూర్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. చంద్రబాబుకు వైసీపీని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేదని అంబటి విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చినప్పటి నుంచి వివిధ రకాలుగా ట్రోల్ చేశారని అన్నారు. అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.

Read Also: ​Inter Exam Fee: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు చెల్లింపు గడువు పెంపు..

అమరావతిలో భవన నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.16 వేల వరకు ఖర్చు చూపడం దేశంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు అంబటి… రాష్ట్రాన్ని కొందరు దోపిడీదారులకు అప్పగించేలా ప్రణాళికలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాంట్రాక్టులు ఇచ్చి కిక్‌బ్యాక్స్ రూపంలో నిధులు వెనక్కి తీసుకుంటున్నారని విమర్శించారు. “అసలు అమరావతి ఎక్కడుంది.. రాజధాని ఎక్కడుంది” అంటూ అంబటి వ్యాఖ్యానించారు. గుంటూరు వెళ్లి బస్ టికెట్ అడిగితే అమరావతి గుడికి టికెట్ ఇస్తారని వ్యంగ్యంగా అన్నారు. సంపద సృష్టి అనే మాటలు నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికే వర్తిస్తాయని విమర్శించారు.

రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధరలు లేవని అంబటి రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు పక్కనపెట్టి రాజధాని పేరుతో అప్పులు చేయడం తప్ప ప్రజలకు ఉపయోగం లేదన్నారు. రాజధానిలో దోచుకోవడానికి నిధులు ఉన్నా, పేదలకు పథకాలు ఇవ్వడానికి నిధులు లేవని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వంపై రెండేళ్లలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని అంబటి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులు కాకుండా ప్రజలు స్వేచ్ఛగా ఓటేస్తే వైసీపీదే విజయం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.

ఇక, జాతీయ రాజకీయాలపై కూడా అంబటి వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, సీఎం చంద్రబాబు నాయుడు మధ్య హాట్‌లైన్ ఇంకా కొనసాగుతోందని అన్నారు. మహిళా బిల్లు ఓటింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలపై కూడా చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు..