Reading Time: < 1 minute
Price Of Airtel Prepaid Plan With An 84 Day Validity Increased

మీరు ఎయిర్ టెల్ నెట్ వర్క్ యూజ్ చేస్తున్నారా? అయితే మీకు బిగ్ షాక్.. ఎయిర్ టెల్ ఆ పాపులర్ ప్రిపేయిడ్ ప్లాన్ ధరను పెంచి షాకిచ్చింది. 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్ ధరను పెంచింది. ఇప్పుడు, ఎయిర్‌టెల్ 84 రోజుల రీఛార్జ్ చేయించుకోవడానికి వినియోగదారులు రూ. 899 చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఇంతకుముందు ఈ ప్లాన్ ధర రూ. 859గా ఉండేది. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 1.5 జీబీ డేటా లభించేది. దీని కోసం కంపెనీ ఇంతకుముందు రూ. 859 వసూలు చేయగా, ఇప్పుడు ఆ ధర రూ. 899కి పెరిగింది.

Also Read:​Inter Exam Fee: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు చెల్లింపు గడువు పెంపు..

ఈ 84 రోజుల ప్లాన్‌లో వినియోగదారులకు లభిస్తున్న ప్రయోజనాలను యథావిధిగా అందిస్తూ, కేవలం దాని ధరను మాత్రమే పెంచింది. ఎయిర్‌టెల్ ఈ 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌లో, వినియోగదారులకు లోకల్, ఎస్‌టిడి, రోమింగ్ నెట్‌వర్క్‌లపై అపరిమిత కాల్స్ లభిస్తున్నాయి. దీని ఆధారంగా, మొత్తం ప్లాన్‌లో 126 GB డేటా లభిస్తుంది. రోజుకు 100 SMSలు, 1.5 GB డేటా కూడా అందిస్తున్నారు. ప్లాన్‌లో రోజువారీ 1.5 GB డేటా పరిమితి అయిపోయిన తర్వాత, ఇంటర్నెట్ వేగం 64 Kbpsకి తగ్గుతుంది.

Also Read:సహజంగా పండిన పండ్లు vs కెమికల్ పండ్లు – ఎలా గుర్తించాలి?

84 రోజుల ప్లాన్ వినియోగదారులకు ఎయిర్‌టెల్ రివార్డ్స్‌లో భాగంగా 12 నెలల అడోబ్ ఎక్స్‌ప్రెస్ సబ్‌స్క్రిప్షన్, ఇన్‌కమింగ్ కాల్స్, SMSల కోసం స్పామ్ హెచ్చరికలు, నెలకు 30 రోజుల ఉచిత హలోట్యూన్స్‌ను కూడా అందిస్తుంది.