Reading Time: < 1 minute
Irans Foreign Minister And Parliament Speaker Temporarily Removed From Israels Kill List Amid Trump Talks

Israel -Iran War: పశ్చిమాసియా ఉద్రిక్తతలు, యూఎస్-ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రపంచాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇరాన్‌ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా, ఆయిల్ సంక్షోభానికి ఎప్పుడు తెరపడుతుందా.? అని ప్రపంచదేశాలు ఎదురుచూస్తున్నాయి. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో చర్చలకు సిద్ధమవుతున్నారు.

Read Also: Shocking Crime: మిల్క్ షేక్‌‌లో విషం కలిపి తండ్రిని చంపిన కూతురు..

ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ తన కిల్ లిస్ట్ నుంచి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ, పార్లమెంటరీ స్పీకర్ మొహమ్ద్ ఘాలిబాఫ్‌లను తొలగించినట్లు సమచారం. చర్చల్లో వీరిద్దరు ప్రధానంగా పాల్గొనే అవకాశం ఉంది. దీంతోనే వీరిద్దరి పేర్లను ఇజ్రాయిల్ తొలగించింది. ఇరాన్‌లో వీరిద్దరు అగ్రశ్రేణి నెగోషియేటర్లుగా ఉన్నారు. వీరిద్దరిని హత్య చేస్తే చర్చలు, దౌత్య ప్రక్రియ ముందుకు వెళ్లదనే ఉద్దేశంతోనే ఇజ్రాయిల్ తన లిస్టు నుంచి తొలగించింది. మధ్యవర్తిత్వం కోసం పాకిస్తాన్, టర్కీ, ఈజిప్టులు పనిచేస్తున్నాయని నివేదికలు చెబుతున్నారు.

‘‘ఇజ్రాయిల్ వీరిద్దరి ఆచూకీ తెలుసుకుని అంతం చేయాలని అనుకుంటుంది. వీరిని చంపేస్తే మాట్లాడటానికి ఎవరూ ఉండరని అమెరికాకు చెప్పాం. అందుకే అమెరికా ఇజ్రాయిల్‌ను వెనక్కి తగ్గాలని చెప్పింది’’ అని చర్చల విషయం తెలిసిన పాకిస్తానీ మూలాలు చెబుతున్నట్లు రాయిటర్స్ తెలిపింది. అయితే, ఈ ఉపశమనం కేవలం తాత్కాలికమైందేనని, దీనికి ఒక గడువు ఉందని తెలుస్తోంది. ట్రంప్‌తో ఉన్నత స్థాయి చర్చల కోసం మార్గం సుగమం చేసేందుకు ఘాలిబాఫ్, అరాఘ్చీలపై నాలుగు లేదా ఐదు రోజుల వరకు ఇజ్రాయిల్ తన కిల్ లిస్ట్‌ నుంచి వీరిద్దరిని తొలగించింది.