Reading Time: < 1 minute
Brent Crude Oil Price Surges 103 Iran Us Tensions Market Impact

Iran US tensions: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచ చమురు మార్కెట్‌పై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. తాజాగా శాంతి ఆశలకు పెద్ద ఎదురుదెబ్బ తగలడంతో ముడి చమురు ధరలు మరోసారి భారీగా పెరిగాయి. గురువారం, బ్రెంట్ క్రూడ్ ధర 103 డాలర్లను అధిగమించి, మార్కెట్‌లో కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా చమురు మార్కెట్‌లో గణనీయమైన అస్థిరత కనిపిస్తోంది. తాజాగా చమురు ధరలు పెరుగుదలకు ప్రధాన కారణం అమెరికాతో ప్రత్యక్ష చర్చలకు ఇరాన్ నిరాకరించడమేనని నిపుణులు చెబుతున్నారు. మార్చి 26, గురువారం నాడు ముడి చమురు ధరలు 1% కంటే ఎక్కువగా పెరిగాయి. ప్రపంచ బెంచ్‌మార్క్ బ్రెంట్ ముడి చమురు బ్యారెల్‌కు సుమారు $103.46కు చేరుకోగా, యూఎస్ డబ్ల్యూటీఐ ముడి చమురు బ్యారెల్‌కు సుమారు $91.54 వద్ద ట్రేడవుతోంది. కొన్ని రోజుల క్రితం ధరలు తగ్గినప్పటికీ.. ఇప్పుడు మళ్లీ పుంజుకోవడంతో పెట్టుబడిదారులలో అనిశ్చితి నెలకొంది.

READ MORE: AP Assembly Special Session: అమరావతి రాజధానిగా చట్టబద్ధత కోసమే ప్రత్యేక సమావేశాలు.. స్పీకర్‌ కీలక వ్యాఖ్యలు..

చమురు ధరల పెరుగుదలకు అతిపెద్ద కారణం ఇరాన్ చేసిన ఓ సంచలన ప్రకటన. అమెరికాతో ఎలాంటి ప్రత్యక్ష చర్చలను ఆ దేశం ఖచ్చితంగా తిరస్కరించింది. కొన్ని దేశాల ద్వారా సందేశాలు పంపుకుంటున్నప్పటికీ, దీనిని ప్రత్యక్ష చర్చలుగా పరిగణించలేమని ఇరాన్ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. గత అనుభవాన్ని ఉటంకిస్తూ, గతంలో చర్చల సమయంలో దాడులు జరిగాయని, అందువల్ల ప్రస్తుతం ప్రత్యక్ష చర్చలకు ఎలాంటి ప్రణాళికలు లేవని అన్నారు. ఇరాన్ చర్చలకు నిరాకరిస్తుండగా, ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, సానుకూల దిశలో సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఇరు దేశాల నుంచి వస్తున్న విభిన్న ప్రకటనలు మార్కెట్‌లో గందరగోళాన్ని సృష్టిస్తూ, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి.

READ MORE: Amaravati Fire Accidents: అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలు.. సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం