Reading Time: < 1 minute
Weather: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై.. వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. ద్రోణి ప్రబావంతో వాతావరణం మారుతుందని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్ర ప్రకారం.. నిన్నటి ద్రోణి తమిళనాడు నుండి మరఠ్వాడా వరకు కర్ణాటక – రాయలసీమ ప్రాంతాల అంతరముగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి. మీ ఎత్తులో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, యానాంపై దిగువ ట్రోపో ఆవరణములో ఆగ్నేయ/ నైరుతి గాలులు వీస్తున్నాయి.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం

శనివారం, ఆదివారం, సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.

ఆదివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురసే అవకాశముంది.

సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.

రాయలసీమ :-

శనివారం, ఆదివారం, సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.

గమనిక :- రాగల 3 రోజుల్లో కోస్తాంద్రలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణముకంటే 2-3 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్, యానములో రాగల 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు.

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు :

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానముగా ఆగ్నేయ దిశ నుండి వీచుచున్నవి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..