
మాస్ మహారాజ రవితేజ హీరోగా, సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వైవిధ్యభరిత చిత్రం ‘ఇరుముడి’. డివోషనల్ టచ్తో కూడిన ఎమోషనల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. రవితేజ గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతుండటంతో అభిమానులు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది.
అది కూడా కేవలం ఒక నెల రోజుల షూటింగ్ మాత్రమే బాకీ ఉందట. అంటే మేకర్స్ ఈ ప్రాజెక్ట్ను పూర్తి స్వింగ్లో ఫినిష్ చేస్తున్నారని అర్థమవుతోంది. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ఆయన కంపోజ్ చేసిన ట్యూన్స్ సినిమాలోని ఎమోషన్స్ను నెక్స్ట్ లెవల్కు తీసుకెళ్తాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అతి త్వరలోనే థియేటర్లలోకి రానుంది.